BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
ఆంధ్రాలో బూతులు - దాడుల రాజకీయం
వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో కల్తీ నిజమేనని సిట్ ఇటీవల కోర్టులో ఫైల్ చేసిన చార్జ్షీట్లో పేర్కొంది. దీంతో వైసీపీని విమర్శిస్తూ టీడీపీ నేతలు ఫ్లెక్సీలు పెట్టారు. గుంటూరులో ఓ ఫ్లెక్సీని తొలగించడానికి వెళ్లిన వైసీపీ నేత అంబటి రాంబాబు.. ఏపీ సీఎం చంద్రబాబును రాయలేని భాషలో తిట్టారు. అనంతరం టీడీపీ శ్రేణులు ఆయన ఇంటిపై దాడి చేశాయి.
టీ20 ప్రపంచకప్: భారత్తో మ్యాచ్లను బహిష్కరించాలన్న పాకిస్తాన్ నిర్ణయంపై ఆ జట్టు కెప్టెన్, మాజీ క్రికెటర్లు ఏమన్నారు?
సల్మాన్ ఆగా విలేకరులతో మాట్లాడుతూ.. 'ప్రపంచకప్ ఆడబోతున్నాం. ఇండియాతో ఆడకూడదనేది మా నిర్ణయం కాదు. మేం ఏం చేయలేం. ప్రభుత్వం లేదా పీసీబీ చీఫ్ ఏం చేయమంటే అది చేస్తాం' అని ఆయన అన్నారు.
వీడియో, లోక్సభలో రాహుల్ గాంధీ ఏం చదివి వినిపించారు? రాజ్నాథ్ సింగ్, అమిత్ షా ఎందుకు అభ్యంతరం చెప్పారు?, వ్యవధి 1,07
'ఇది కచ్చితంగా విశ్వసనీయమైనది. తన పుస్తకాన్ని ప్రచురించకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని నరవాణే చెప్పారు. ఇందులో నుంచి 5 వ్యాక్యాలు మాత్రమే చదవాలనుకుంటున్నాను. ఇందులో రాజ్నాథ్ సింగ్, మోదీ గురించి నరవణే ప్రస్తావించారు' అని రాహుల్ అన్నారు.
బంగారం, వెండి ధరలు ఎందుకు పడిపోతున్నాయి? మళ్లీ ఇప్పట్లో పెరగవా?
అంతర్జాతీయంగా ఏర్పడిన అస్థిర పరిస్థితుల మధ్య బంగారంలో పెట్టుబడి పెట్టడం సురక్షితంగా భావించడంతో జనవరిలో బంగారం ధరలు కొత్త రికార్డులను తాకాయి. అయితే శుక్రవారం కెవిన్ వార్ష్ పేరును యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్గా ప్రతిపాదించడంతో మెటల్స్ మార్కెట్లో ధరలు పతనం అయ్యాయి.
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2025: అయిదుగురు నామినీలు వీరే
భారత క్రీడాకారిణుల ప్రతిభ, కృషి, వారు సాధించిన విజయాలకు గుర్తుగా ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును బీబీసీ అందిస్తోంది.
ప్రపంచంలో పాముకాటుతో మరణిస్తున్న ప్రతి ఇద్దరిలో ఒకరు భారతీయులే.. ఇండియాలో దొరికే యాంటీ వీనమ్ ఆ నాలుగు పాముల విషానికి మాత్రమే విరుగుడా?
ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 54 లక్షల మంది పాముకాటుకు గురవుతుండగా, లక్ష మందికి పైగా మరణిస్తున్నారు. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని నిరుపేద గ్రామీణ వర్గాలపైనే పాముకాటు ప్రభావం ఎక్కువగా ఉందని కూడా డబ్ల్యూహెచ్వో పేర్కొంది.
పాక్, చైనాలతో పోలిస్తే భారత రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపులు ఎక్కువా, తక్కువా?
"మన బడ్జెట్ కంటే చైనా బడ్జెట్ చాలా ఎక్కువ. అయితే పాకిస్తాన్ బడ్జెట్ను తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా భారత్ పొరుగున ఉన్న అనేక దేశాలకు చైనా సాయమందిస్తుంది. కాబట్టి ఇలాంటి పోలికలు చేయలేం''
టీ 20 వరల్డ్ కప్: పాకిస్తాన్ మ్యాచ్కు రాకపోతే స్టేడియంలో భారత్ జట్టు ఏం చేస్తుంది?
ఐసీసీ నిబంధనల ప్రకారం, మ్యాచ్ను బహిష్కరించిన జట్టు నెట్ రన్రేట్ కూడా ప్రభావితమవుతుంది. అయితే, ఆ మ్యాచ్లో ప్రత్యర్ధి జట్టు(ఇక్కడ భారత జట్టు) నెట్ రన్ రేట్పై ఎలాంటి ప్రభావం ఉండదు.
అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై దాడులు, రాజమండ్రి జైలుకు మాజీ మంత్రి, ఈ ఘటనల వెనక అసలేం జరిగింది?
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. సీఎం చంద్రబాబును అభ్యంతరకర పదజాలంతో దూషించిన నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేశారు. తిరుమల లడ్డూ కల్తీ వివాదం పై తెలుగుదేశం ఫ్లెక్సీతో మొదలైన వివాదం అంబటి అరెస్టు దాకా సాగింది. అసలు గుంటూరులో ఏం జరిగింది?
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్లో
షార్ట్ వీడియోలు
ఫీచర్లు
అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
రహమాన్ డకైత్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
తెలుగుప్రజలు అరుణాచలానికి ఎక్కువగా ఎందుకు వెళతారు?
18వ శతాబ్దం నాటికే అరుణాచలం దగ్గర తెలుగు శాసనాలు కనిపించాయి. ప్రస్తుత అరుణాచల గోపుర నిర్మాణం ప్రారంభించింది శ్రీకృష్ణదేవరాయలు అయితే, దాన్ని పూర్తి చేసింది తంజావూరు తెలుగు పాలకుడు సేవప్ప నాయకుడు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































